– ఆలయ కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం…
– ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, బీబీపూర్ తాండ వయా మాక్లూర్ తాండ రోడ్డు కి.మీ. 0/0 నుండి కి.మీ. 5/0 వరకు బి.టి. రోడ్డు నిర్మాణం కొరకు ₹ 4.50 కోట్లు రూపాయలతో రోడ్డు నిర్మాణం కోసం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారు.తెలంగాణ ప్రభుత్వము రహదారులు, భవనముల శాఖ నిధులతో డిచ్ పల్లి ఖిల్లా రామాలయం శ్రీ సీతారామస్వామి మందిరం వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొసం ₹ 97.50 లక్షలు రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపడ్తున్నమని వివరించారు. అనంతరం డిచ్ పల్లి ఖిల్లా రామాలయంలో నూతనంగా ఏర్పడ్డ ఆలయ నూతన కమిటీకి మంజూరు పత్రాలను అందజేశారు. ఖిల్లా రామాలయం శ్రీ సీతారామస్వామి అలాయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించి సబ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అధ్యక్షులు, నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి, ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జీనియస్ నారాయణరెడ్డి, సొసైటీ చైర్మన్ గజవడ జైపాల్ , ఎంపీటీసీల పొరం అధ్యక్షులు సాయిలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు అమీర్ ఖాన్, టిఆర్ఎస్వి యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, సర్పంచులు, గోపు నడ్పన్న, నీరడి పద్మారావు,మోహమ్మద్ యూసఫ్, పాపాయి తిరుపతి,జగదీష్ రాథోడ్, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ ,నల్లవేల్లి సాయిలు, ఓడ్డేం నర్సయ్య,రాథోడ్ విట్ఠల్,అంబరసింగ్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రొద్దుటూరు మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు నల్ల నిర్మల, కందగిరి వినోద్, గట్టావలి సాగర్, ఆసది తోట జయసుధ, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ఆసది రవీందర్, నల్లా హరికిషన్, లోక్కిడి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు బాలేఖర్ ప్రవీణ్, చెలిమేల శ్యాంసుందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు షేరు గంగాధర్, బీసీ సెల్ అధ్యక్షులు మధ్య నర్సయ్య, యూత్ అధ్యక్షులు రాస మల్ల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.