నవతెలంగాణ – హైదరాబాద్
వచ్చే ఏడాదిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ను జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్లో ఉచిత కోచింగ్ను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 150 మందిని ఎంపిక చేయనున్నారు. సంబంధిత ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో తొలి 50 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయగా, మరో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు.