నవ తెలంగాణ- నూతనకల్: ఇటీవల మండల కేంద్రానికి చెందిన జూలూరి సతీష్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం స్నేహితులు మండల కేంద్రంలోని జిల్లా పాఠశాల లో పదవ తరగతి (2000-2001)విద్యను అభ్యసించిన మిత్రులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి చిన్ననాటి మిత్రుల సహకారంతో 40వేల 500వందల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్, ఆగమల్లు, శ్రీదర్, సంతోష్, చిరంజీవి తదితరుల పాల్గొన్నారు.