నవ తెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మాజీమంత్రి దామోదర్ రెడ్డి కి కాదని ఎవరికైనా ఇస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల రాంబాబు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గత 40 సంవత్సరాలుగా కాపాడుతున్న దామోదర్ రెడ్డి కి అధిష్టానం సూర్యాపేట టికెట్ కేటాయించాలని కోరారు.తన లాంటి ఎంతో మంది యువకులకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చిన దామన్న కు పార్టీ టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.