– నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి
నవతెలంగాణ- కొడంగల్
రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని కాం గ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రేవంత్రెడ్డిని సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి అని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలిపారు. కొడంగల్లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ ప్రతినిధి ఎండీ యూసుఫ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడంగల్లో శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థిగా నామి నేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఆనవాయితీగా రేవంత్ రెడ్డి తన స్వగ్రామం లో దేవాల యం లో పూజలు నిర్వ హించి కొడం గల్కు చేరు కుం టారని, కొ డంగల్లో తన నివాసంలో కార్య కర్త లను ఉద్దేశిం చి మా ట్లాడిన అనం తరం నామినేషన్ దాఖ లు చేస్తా రన్నారు. కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరు కావా లని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ కాం గ్రెస్ పార్టీ పరిశీలకులు సల్వరాజ్, జాతీయ కాంగ్రెస్ పార్టీ మై నారిటీ సెల్ నాయకులు విజయరాజులు మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్య విధానాలు అమలు పరచాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు, తెలంగాణ లో ముక్తకం ఠంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాబోతుం దని చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందన్నారు. సమ స్యలన్నీ పరిష్కా రం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కష్ణం రాజు, సర్పంచ్ బాల్రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏనుగుల భాస్కర్, కౌన్సిలర్ శంకర్ నాయక్, కొడంగల్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము, పట్టణ కార్యదర్శి రా ము, ఎస్ఎం. గౌసన్, ఆసిఫ్ ఖాన్, ఎస్టీ సెల్ నాయ కులు తార్య నాయక్, పాల్గొన్నారు.