యాదగిరిగుట్ట విమానగోపురానికి బంగారు తాపడం

– పనులపై కమిటీ ఏర్పాటు
– సర్కార్‌ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యాదగిరిగుట్టలోని విమానగోపురా నికి బంగారాన్ని తాపడాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ కన్వీనర్‌గా వైటీడీఏ వైస్‌చైర్మెన్‌, సీఈఓ జి.కిషన్‌రావు, సభ్యులుగా రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌, శ్రీలక్ష్మినరసింహాస్వామి దేవస్థానం ఈఓ ఎన్‌.గీతా వ్యవహరిస్తారు.