నవతెలంగాణ – ఒడిశా
ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాయగడ్ జిల్లాలోని అంబడోల సమీపంలో గూడ్స్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రత్యేక రూట్లో ప్రయాణిస్తున్నందున ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించారు. విషయం తెలియగానే రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పడానికి గల కారణాలను ఆరా తీసే పనిలో ఉన్నారు. ఈ గూడ్స్ రైలు అంబడోలా నుండి ప్రత్యేక రూట్ లో లాంజీగర్ వేదాంత లిమిటెడ్ ప్లాంట్ కు వెళుతోంది.