నవతెలంగాణ – కొత్తగూడ: తమ సమస్యలు పరిష్కరించాలని 25 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు మహబూబాబాద్ కు తరలి వెళ్లారు. కార్యక్రమంలో సుమారు 25 మంది గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.