![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230818-WA00241.jpg)
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను తెలంగాణ గౌడ చైతన్య ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య సాధన సమితి అధ్యక్షులు మార్క అనిల్ గౌడ్ మాట్లాడుతూ నైజాం క్రూరత్వ పాలనకు, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడి సబండ వర్గాలను ఏకం చేశాడని అన్నారు. బహుజన సామ్రాజ్య చక్రవర్తిగా గోల్కొండ కోట రాజుగా రాజ్యాధినేత బహుజన రాజ్య స్థాపన చేసిన పాపన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం సంతోషకరమన్నారు . ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, సర్పంచ్ దేవసాని సుశీల, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సుశీల,మార్క చంద్రయ్య గౌడ్, పాకాల శ్యాంసుందర్ గౌడ్, రంగు తిరుపతి గౌడ్, చెప్పాలా మల్లయ్య గౌడ్, కానుగుల మోహన్, సబ్బని వెంకటేశం, బత్తిని వెంకటరాజ్యం, వన్వోజు శ్రీధర్, గద్దపాక రాజిరెడ్డి, మార్క శ్రీనివాస్, జాగిరి శ్రీనివాస్, కలపెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.