నవతెలంగాణ-కొడంగల్
కృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవిద్య టెక్నో పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, గోపికల వేషాలు ధరించి ఆట పాటలతో పాటు నృత్యాలు ప్రదర్శించారు. ఈ వేడు కలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ ఈ. సువర్ణ మాట్లాడుతూ..విద్యార్థులకు చదువులతో పాటు భారతీయ సంస్కృతి, మన పండుగల ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులలో ఉన్న కళలను బయటకి తీయడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలు వారిలో నింపడానికి ఇలాంటి పండుగలు ఎంతో దోహదపడతా య న్నారు. వివిధ వేషధారణతో పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.