నవతెలంగాణ – హైదరాబాద్: జీవితమంతా పేదరికంలో గడిపిన ఓ పంజాబీ యువకుడు కౌన్ బనేగా కరోడ్పతీ టీవీ షో పుణ్యమా అని కోటీశ్వరుడైపోయాడు. ఓ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి రూ. కోటి గెలుచుకున్నాడు. తదుపరి ఎపిసోడ్లో రూ.7 కోట్ల ప్రశ్నను ఎదుర్కోనున్నాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో 15వ సీజన్లో పాల్గొని జస్కరణ్ సింగ్ విజేతగా నిలిచాడు. జస్కరణ్ స్వస్థలం తరన్తరన్ జిల్లాలోని ఖల్రా గ్రామం. అతడిది నిరుపేద కుటుంబం.