– అరేపల్లిలో హెల్మెట్ల పంపిణీ
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
రోడ్డు ప్రమాద నివారణకు హెల్మెటే రక్ష అని కేఆర్ఆర్ ఫౌండేషన్ రజనీకాంత్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామంలో సోమవారం మనకోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కేఆర్ఆఆర్ ఫౌండేషన్ అధినేత కోమటి రెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ ను ధరించే ప్రయాణం చేయాలని, రోడ్డు ప్రమాదలను అరికట్టాలంటే హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్నారు. గతంలో హెల్మెట్ల ధరించక రోడ్డు ప్రమాదంలో వాహన దారులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని గుర్తు చేశారు. నేడు దుబ్బాక మండల పరిధిలోని గ్రామాల్లో అలాంటి ఘటనలు ఎక్కడ జరగొద్దనే ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనదారులు హెల్మెట్లు ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని సూచించారు.ఈ గ్రామానికి మరింత సేవ చేస్తానని… ఏ సహయం కావాలన్నా తనను సంప్రదించాలని గ్రామ ప్రజలకు కోరారు. వాహనదారుల కోసం కే ఆర్ ఆర్ అధినేత చేస్తున్న మంచి పనిని ఆ గ్రామ సర్పంచ్ శెట్టి లక్ష్మి సంతోష, చికొడ్ ఎంపీటీసీ రాం రెడ్డి,రఘోత్తం పల్లి సర్పంచ్ దేవిరెడ్డి, పోతారం సర్పంచ్ జనార్దన్ రెడ్డిలు అభినందించారు. అంతక ముందు యువత, ద్విచ్రవాహనదారులు హెల్మెట్లను సద్వినియోగం చేసుకుని ప్రయాణం సాగించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి సంతోష కృష్ణంరాజ్, ఎంపీటీసీ రామిరెడ్డి, రఘోత్తం పల్లి సర్పంచ్ దేవిరెడ్డి, పోతారం సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మూర్తి కరుణాకర్ రెడ్డి, తొగుట అనిల్, మోహన్ రెడ్డి, శేఖర్, స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.