తెలంగాణ యూనివర్సిటీ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం యూనివర్సిటీ లోని అధ్యాపకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైన ప్రొఫెసర్ ఎం.యాదగిరి (రిజిస్ట్రార్), కలల శాస్త్ర పీఠాధిపతి నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ త్రివేణి, అర్థశాస్త్ర విభాగ అధిపతిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఎ.పున్నయ్య లకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ యూనివర్సిటీ అధ్యక్షులు కే. శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని, మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దత్త హరి, స్వప్న, నవ్య, ,ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు అభినయ్, కార్యదర్శి రాజేందర్, అనిల్ కుమార్, విజయకుమార్, రాజ్ కుమార్, విద్యార్థులు అనిల్ నంద, రమేష్, సంధ్య, సరోజ, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు