– ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ సోమయ్య అప్ప కే వస్తుందని ప్రజల్లో జోరుగా చర్చలు
నవతెలంగాణ- మద్నూర్
బిచ్కుంద మండల కేంద్రంలోని అప్ప మఠాధిపతి సోమయ్యప్ప జుక్కల్ నియోజకవర్గం రిజల్ట్ కాన్స్టెన్సీ నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సన్మానించడం బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ కోసమేనా అంటూ జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో జోరుగా చర్చలు వినబడుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం ముఖ్యమంత్రి చేత భూమి పూజ చేపట్టడం ఆ కార్యక్రమంలో ఎందరో పీఠాధిపతులు హాజరైనప్పటికీ బిచ్కుంద మఠాధిపతి సోమయ్య అప్ప ముందుండి ముఖ్యమంత్రి చేత పూజలు జరిపించడం ఆ తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించడం జుక్కల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సోమయ్యప్పకు టిక్కెట్టు కాయంగా కనిపిస్తుందని నియోజకవర్గ ప్రజలు జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రకటన చేసే వరకు వేచి చూడవలసిందే.