– కోఠి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు విద్యార్థినిల ధర్నా..
– ఏబీవీపీ విద్యార్థినిల కన్వీనర్ పి సిరివెన్నెల గౌడ్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ మహిళ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు పెద్ద ఎత్తున విద్యార్థినిలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ విద్యార్థినిల కన్వీనర్ పి. సిరివెన్నెల గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా యూనివర్సిటీ కి 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వని దుస్థితి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళ యూనివర్సిటీలో మౌలిక వసతులు లేకుండా విద్యార్థులు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి సామాన్య మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ హాస్టల్లో సదుపాయాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన కనీసం విద్యార్థుల గోడు వినని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థినీలు ప్రవేట్ హాస్టల్లో ఉండే సోమత లేక చదువును అర్ధాంతరంగా నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు అనుగుణంగా హాస్టల్లో వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోషి , హరిణి , శ్రావణి , ప్రత్యూష , నందిని పాల్గొన్నారు.