నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన నరసయ్య, నరసింహులు ,నాగులు నివాసం ఉంటున్న ఇండ్లు వర్షాలకు కూలిపోయింది, దీంతో ఇండ్లలో ఉన్న వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆస్తి నష్టం అంచనా వేశారు. అనంతరం మల్లుపల్లి ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి సైతం గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు