నవతెలంగాణ- బెజ్జంకి
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆటో యూనియన్ సభ్యులు మానవత్వం చాటారు.మండల కేంద్రంలో నిలువ నీడ లేని పలువురు వృద్ధులు శీతాకాలం చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా అదివారం ఆటో యూనియన్ సభ్యులు తమ చందాలతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఆటో యూనియన్ సభ్యులు చూపిన మానవత దృక్పథానికి మండల కేంద్రలోని ప్రజలు అభినందనలు తెలిపారు.