శరీరంలో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. రక్తం తగ్గితే నీరసం ఆవహిస్తుంది. నిస్త్రాణంగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ, రక్తహీనత రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతుంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరి..!
– రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి.
– జున్ను నుంచి బీ-12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడి బియ్యం వాడాలి.
– రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
– బీట్రూట్ క్యారట్ ఉసిరి కలిపి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా వస్తుంది. ఐరన్ సమద్ధిగా ఉంటే రక్తహీనత రాదు..
– గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది.
– ప్రతిరోజూ మధ్యాహ్నం పూట తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోవాలి.
ఇలాంటివన్నీ పాటిస్తే రక్తహీనత సమస్య దరిచేరదు.