![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230927-WA0043-1024x462.jpg)
నవతెలంగాణ – పెద్దపల్లి
గత 15 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కరించాలని అలుపులేని పోరాటం చేస్తున్న అంగన్వాడి ఉద్యోగు లకు అండగా ఉంటామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు k. ఆశ్రిత్ (ఎల్ఐసి )కడారి సునీల్ (ఏఐటియుసి) వేల్పుల కుమారస్వామి సిఐటియు )టి శ్రీమాన్( బీసీ సంక్షేమ సంఘం) జిల్లా అధ్యక్షులు) S. రవీందర్ (ఎస్ఎఫ్ఐ )కల్లేపల్లి అశోక్ కెవిపిఎస్ )రాజేందర్ (వ్యవసాయ కార్మిక సంఘం) లెనిన్ (ఏఐఎస్ఎఫ్ )అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య నిరంకుశ వైఖరిని ఖండించారు. సమస్యల పరిష్కరించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేంతవరకు మీ పోరాటాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. అంగన్వాడి ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతలేరని 40 సంవత్సరాలు గా పేద ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయమని మాత్రమే అడుగుతున్నారని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఆర్ కమలేష్ జి జ్యోతి , K. శోభ, సుగుణబాయి ,ఎస్ రామలక్ష్మి, T. కృష్ణకుమారి,హరిత, స్వరూప, మహేశ్వరి ,చంద్రకళ జిల్లాల ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ సందీప్ రామగళ్ళ. సురేష్ అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.