![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230916-WA0005-1024x576.jpg)
నవతెలంగాణ – కంటేశ్వర్
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడల సమ్మె మరింత ఉదృతం చేస్తాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంప్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించి ఆఫీస్ కార్యదర్శి కి మెమోరండం ఇవ్వటం జరిగింది. ఈ ధర్నాకు మద్దతు తెలియజేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బదులు తోటి కార్మికులను పోటీగా పంపి కార్మికుల మధ్య విభేదాలను సృష్టించాలని చూస్తున్నారని దీని మూలంగా సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప ఉద్యమం నీరుగారదని ఆయన అన్నారు అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆరు రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉంటే సమస్యను సానుకూలంగా అర్థం చేసుకొని అంగన్వాడీ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారం చేసే బదులు ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అధికారులను అడ్డం పెట్టుకొని అంగన్వాడి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దీని మూలంగా మరింత పట్టుదలగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుందని జరిగే పరిణామాలను ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లు కొత్తవేమీ కావని గత పది సంవత్సరాలుగా అనేక మార్లు ధర్నాలు నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించినవేనని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మూడోసారి తిరిగి తామే అధికారంలోకి వస్తాం అన్న ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తమ ఉద్యమ ప్రతాపాన్ని చూపించిన విధంగానే నేటి పాలకులకు కూడా రుచి చూపించే పరిస్థితి వస్తుందని అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. శాసనసభ్యులు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ మోపాల్ మండల నాయకులు రాజ్యలక్ష్మి, సూర్య కళ, విజయ, ధర్పల్లి మండల నాయకులు గోదావరి, విజయ, రేణుక డిచ్పల్లి మండల నాయకులు రాణి తదితరులు పాల్గొన్నారు.