నవతెలంగాణ-చివ్వేంల : ఎస్సీ వర్గీకరణ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బొంద పెడతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి అన్నారు . మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీ నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 6 వ రోజు రిలే నిరాహార దీక్ష ను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యర్ర వీరస్వామి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జి బొడ్డు విజయ్, మండల కన్వీనర్లు -చెరుకుపల్లి సతీష్,మొలుగూరి సునీల్, మండల నాయకులు కొంగల సతీష్,సిరపంగి లింగస్వామి , మొలుగూరి రాజు,బచ్చలి జ్యోతిబాబు, మొండి కత్తి లింగయ్య, బొల్లికొండ మహేష్, మొలుగూరి వెంకన్న, నాగరాజు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.