![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230930-WA0017-300x170.jpg)
నవతెలంగాణ- కంటేశ్వర్
స్కీం వర్కర్లు సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బొంద పెడతాం అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారంటే గత 20 రోజులుగా అంగన్వాడీ టీచర్స్,మినీ టీచర్స్, హెల్పర్స్, 6 రోజులు గా ఆశా వర్కర్లు,3 రోజు నుండి మధ్యాహ్నం భోజనం కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారని, సమ్మెలలో పెట్టిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని, లేని యెడల రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బొంద పెడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ వద్ద అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం మానవహారం నిర్వహించడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్,మినీ టీచర్స్, హెల్పర్స్,ఆశా వర్కర్లు,మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజనం పథకాలలో పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని,గౌరవ వేతనం ఇస్తూ,కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని,పని గంటలు అమలు కావడం లేదని,పని భారం పెంచుతూ అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారని,ఆయా శాఖలకు సంబంధం లేని పనులను అప్పగిస్తున్నారని అన్నారు.ఉద్యోగ భద్రత లేకుండా,ప్రమాద భీమా సౌకర్యం లేకుండా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకుండా పని చేస్తున్నారని, చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం సౌకర్యాల కల్పన గురించి మాట్లాడకుండా,ఈ స్కీం వర్కర్లు పై పచ్చి అబద్ధాలను మంత్రులు ఆడుతున్నారని అన్నారు.కరోనా వంటి ప్రకృతి విపత్తు వచ్చిన సందర్భం లో ప్రజల ప్రాణాలు కాపాడడం లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. కరోనా వారియర్స్ అనే పేరు తప్ప ప్రభుత్వం నుండి ఏమి గుర్తింపు లేదని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పట్ల అత్యంత బాధ్యత గా వ్యాహరిస్తున్నరని, ప్రభుత్వానికి చెందిన ప్రతి సర్వే ని చేయడం తో పాటు, కేంద్ర స్థాయిలో అనేక అవార్డులు రావడానికి స్కీం వర్కర్లు కృషి ఎనలేనిదని అన్నారు. స్కీం వర్కర్లు సేవలు పొందుతున్న లబ్ధిదారులంతా స్కీం వర్కర్లు వెంటే సమ్మె లో నిలబడ్డారని,వీరి మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నదనిఅన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కీం వర్కర్లు రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల సమ్మె ని మరింత ఉదృతం చేస్తామని,రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ, వాణి జరీనా విజయ హైమావతి, అనీష్ ఆశ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, రేవతి, రాధా, లలిత, శోభా భారతి వహీదా, మధ్యాహ్న భోజనం జిల్లా నాయకులు చామంతి లక్ష్మి సుజాత సుమలత గంగాధర్ లక్ష్మీ గంగమ్మ లు పాల్గొన్నారు.