– సీఎం కేసీఆర్ హయంలోనే రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు
– అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కారుకు ఓటు వేయండి
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి , విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్కు ఓటు వేస్తే అంతా చీకటే అవుతుందనీ, రైతులకు మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామంటున్నారని వ్యవసాయ రంగం గురించి తెలియని కాంగ్రెస్ వారికి ఓటేస్తే, అభివృద్ధి నిలిచిపోతుందనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. 24 గంటలు ఉచితంగా ఇచ్చే సీఎం కేసీఆర్కే బలపరచాలనీ మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలి పించాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బంజారా గడ్డ తండా, దావూద్ గూడాతండా, పోచమ్మతండా, పెద్దమ్మతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళినగర్, బాచుపల్లి, జైతారం, కొత్తగూడ గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. కరెంటు సక్రమంగా సరఫరా చేయక ఆ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసినట్టు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కందుకూరు మండలానికి లా కళాశాల, మెడికల్ కళాశాల, 450 పడకల ప్రభుత్వ ఆస్పత్రి మంజూరు చేసినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ దాసర్లపల్లి గేటు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారని తెలిపారు. మహేశ్వరంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు.అభివద్ధి చూసి ఓటు వేయాలని, అభివృద్ధికే పట్టం కట్టాలని మహేశ్వరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు ఆలో చించి తమను ఆదరించి కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీసీ బొక్క జంగారెడ్డి, ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర మాజీ సభ్యులు చిలకమర్రి నరసింహ, మార్కెటింగ్ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ , నాయకులు లక్ష్మినరసింహ రెడ్డి, అనెగౌడ్ అంజయ్య గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షులు మన్నే జయేం దర్, మాజీ వైస్ ఎంపీపీ సంధ్యా దామోదర్ గౌడ్, సర్పంచులు అనిత శ్రీనివాస్, సుమన్, విజయ, బాల కృష్ణ, సోమ్లానాయక్, శ్రీదేవి, శ్రీనివాస్, ఎంపీటీసీలు రాజశేఖర్రెడ్డి, సురమోనీ లలితా కుమార్, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, నాయకులు కాకి దశరథ, పోలె మోని అశోక్, అమరేందర్ రెడ్డి, సాదా పాండు రంగారెడ్డి, పాండు గౌడ్, సామయ్య, సర్పంచ్ మంద సాయిలు, బొక్క దీక్షిత్ రెడ్డి, తాళ్ల కార్తీక్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.