– మూడు చక్రాల బండి కోసం రూ.15 ఇవ్వాల్సిందే…
– వికలాంగుడిని డబ్బులు డిమాండ్ చేసిన సర్పంచ్
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : పైసలిస్తే చాలు పని అయిపోతుంది. అర్హత లేకున్నా సరే పైసలు ఇచ్చిర్రు అంటే గిఫ్ట్ స్మైల్ కింద మూడు చక్రాల బండి ఇంటికి వస్తుంది. మూడు చక్రాల బండి కావాలని ఓ వికలాంగుడు సర్పంచిని అడుగుతే రూ.15 వేలు ఇవ్వు నీకు బండి ఇప్పిస్తానని చెప్పి పంపిన సర్పంచ్, సర్పంచ్ నమ్మిన బంటు వికలాంగుడితో అన్నమాట లివి. మండలంలోని పద్మ నగర్ గ్రామానికి చెందిన కుచ్చుల రాజేశం పుట్టుకతోనే వికలాంగుడు. ఎక్కడి కైనా వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గతంలో గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం ద్వారా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. నాకొక మూడు చక్రాల వాహనాన్ని ఇప్పించాలని టిఆర్ఎస్ నాయకులను పలుమార్లు కోరిన ఎవరు నన్ను పట్టించుకునే పాపాన పోలేదన్నాడు. విసుకు చెంది చివరికి గ్రామ సర్పంచ్ వద్దకు వెళ్లి నాకు ఒక మూడు చక్రాల వాహనాన్ని ఇప్పించాలని పద్మనగర్ సర్పంచ్ ముడారి పోచయ్య ను వికలాంగుడు గత వారం రోజుల క్రితం కలిసి కోరానన్నాడు. సరే ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి నన్ను వెళ్లిపొమ్మని చెప్పి కాసేపటికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్పంచ్ తను నమ్మిన బంటును నా దగ్గరకు పంపించి నీకు మూడు చక్రాల బండి కావాలంటే రూ.15వేలు సర్పంచ్ కు ఇస్తే బండి ఇప్పిస్తానడట..డబ్బులు ఇవ్వమన్నాడని చెప్పి డబ్బులు తీసుకురమ్మని నా దగ్గరకు పంపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.15వేలు ఉంటే నేనే ఓ వాహనాన్ని కొనుక్కునే వాడినని నా దగ్గర డబ్బులు లేవని మీకెందుకు డబ్బులు ఇవ్వాలని అతనిని ప్రశ్నించినట్లు తెలిపాడు. గ్రామానికి సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధి ఇలా వికలాంగుడిని చూడకుండా నన్ను డబ్బులు డిమాండ్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనర్హులకు కూడా వాహనాలను గతంలో అందించారు. పలుమార్లు టిఆర్ఎస్ నాయకులను కోరిన అర్హుడైన నాకు మూడు చక్రాల వాహనాన్ని అందించలేదని తన బాధను వెళ్లగక్కాడు. గిఫ్ట్ ఏ స్మైల్ వాహనం కావాలంటే అనర్హులైన సరే డబ్బులు ఇస్తే చాలు వాహనం ఇంటికి వస్తుంది.