– సందడి చేసిన ప్రముఖ నటి శ్రుతి హాసన్
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్.
అక్టోబర్ 15న ప్రారంభమైన ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ నవంబర్ 22 వరకు కొనసాగనుందని ఎగ్జిబిషన్ కన్వీనర్ దినేష్ జైన్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ నటి శ్రుతి హాసన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెమ్ అండ్ జ్యువెలరి కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆభరణాల ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందిందని అన్నారు. ఇందులో దేశ వ్యాప్తంగా 1500 సంస్థలు భాగస్వామ్యం పొందాయని తెలిపారు. ఈ ఫెస్టివల్ వల్ల జువెలరీ రంగంలో గ్రోత్ పెరిగి, అటు కార్మికులకు, వ్యాపారులకు ఎంతో లబ్ది జరుగుతుందని పేర్కొన్నారు. నగలు కొనుగోలు చేసే వారికి ప్రతి రూ.25 వేల ఖరీదుపై ఒక కూపన్ ఇస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ నటి శ్రుతి హాసన్ సందడి చేశారు. నమ్మకం, నాణ్యత కోసం ఐజేఎస్ఎఫ్ ఫెస్టివల్లో పాల్గొని ఆభరణాలు కోనుగోలు చేయాలని కోరారు. తనకు హైదరాబాద్ అన్నా ఇక్కడి ప్రజలన్నా ఎనలేని గౌరవమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ సభ్యులు సాయియామ్ మెహ్రా, మనోజ్ ఝా, రాజేష్ రోక్డే తదితరులు పాల్గొన్నారు.