![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/Untitled-1-copy-130.jpg)
అంగన్వాడీల అరెస్టు అప్రజాస్వామిక చర్య అని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయు) మండల అధ్యక్షురాలు జమున రాణి, జిల్లా కమిటీ సభ్యులు బొద్దూలూరి సరిత లు గురువారం ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల (తమ) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను ఎక్కడికక్కడే అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యకమని హెచ్చరించారు. అంగన్వాడి టీచర్లు మహిళలని చూడకుండా అర్థరాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. 18 రోజులుగా సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, అంగన్వాడి సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమ, నిర్మల, శ్రీకల, వెంకటలక్ష్మి, పదిమంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.