![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230828-WA0167.jpg)
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఖాతాదారులు ఏపీజివీబీ బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలనీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అన్నారు. సోమవారం అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో ఏపీజివీబీ నూతన భవనాన్ని సిద్దిపేట రీజినల్ మేనేజర్ ఆశలత, చిట్టాపూర్ బ్యాంక్ మేనేజర్ రంజిత్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ విషయంలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని బ్యాంక్ మేనేజర్ , సిబ్బందిని సూచించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ర్యాకం శ్రీరాములు,పెంటి కిషన్, నవీన్, నగేష్, సాయి కిరణ్,జంగి కిషోర్, సతీష్, బ్యాంక్ సిబ్బంది ప్రసాద్, తదితరులు ఉన్నారు.