![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230917-WA0003-300x236.jpg)
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతా రెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు జాతీయ జెండా ఆదివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంత రెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం రజకార్లు అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ చేతిలో ఉంచుకొని ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని, ప్రజల స్వేచ్ఛను కాలరాస్తూ వారిని ఎదిరించిన వారిని శిక్షలు విధిస్తూ నిజం రజకర్లు ప్రజలను దోచుకునే వారని ఆయన అన్నారు. అటువంటి సందర్భంలో ప్రజలు ఎంతో మంది తిరుగుబాటు చేశారని కానీ నిజం సర్కార్లు తిరుగుబాటు చేసిన వారందరిపై తూటాలు కాల్చారని ఆయన అన్నారు. 1947 సెప్టెంబర్ 7వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిసారి నిజం రజకార్ల ఆకృత్యాలపై పార్లమెంట్లో ప్రకటన చేశారు చేశారని, తద్వారా ప్రజల పోరాటం మరియు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చోరువతో హైదరాబాదులో నిర్వహించిన పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణకు విముక్తి దొరికిందని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిజాం రజకార్ల మాదిరిగానే నిరంకుశ పాలనకు తెరలిపిందని ,అబద్ధపు హామీలతో అతీకారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతుందని, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మరింత దుర్భరం చేసిందని ఆయన అన్నారు.జిల్లా ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, డి సి సి డెలిగేట్ అంతా రెడ్డి విజయపాల్ రెడ్డి ,రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, కేశ రాజు, నరేంద్ర సింగ్ ,యెండల కిషన్ తదితరులు పాల్గొన్నారు.