నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ను 191 పరుగులకే కట్టడి చేసిన భారత్… లక్ష్యఛేదనలో 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. భారత బ్యాట్స్ మెన్లలో కెఫ్టెన్ రోహిత్ శర్మ (86) ఫోర్లు, సిక్స్ లతో విద్వంసం సృష్టించాడు. శ్రేయస్ అయ్యార్ 53 నాటౌట్ గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అప్రిది రెండు వికెట్లు తీయగా హసన్ ఆలీ ఒక వికెట్ తీశాడు.