![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/IMG-20231002-WA0041-300x200.jpg)
గత 3రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ గుర్తు తెలియని అనాధ శవానికి అంత్యక్రియలను నిజామాబాద్ రూరల్ ఠాణా యస్.ఐ మహేష్ అనుమతితో నగరంలోని దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించటం జరిగిందని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు సోమవారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు దారం గంగాధర్, మద్ది గంగాధర్, ఈ.సి మెంబర్ కాసుల సాయితేజ, నిజామాబాద్ రూరల్ ఠాణా పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.