నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచకప్లో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాపై విమర్శల పరంపర కొనసాగుతున్నది. ఐదుసార్లు విశ్వవిజేతలుగా నిలిచిన కంగారూలు ఈ సారి వరల్డ్కప్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండానే వచ్చారని ఒకరంటే.. వాళ్ల ఆటతీరులోనే లోపాలున్నాయని మరొకరి విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆడేందుకు భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా కేవలం ఒక్క స్పిన్నర్తనే పని కానిచ్చేద్దాం అనుకోవడమే అతిపెద్ద తప్పని గౌతీ అభిప్రాయపడ్డాడు. స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై ఒక్క స్పిన్నర్ సరిపోతాడని కంగారూలు ఎలా ఆలోచించారో తనకు మాత్రం అర్థం కావడం లేదని గంభీర్ అన్నాడు. ‘ఇది చిన్న తప్పిదమేం కాదు. స్పిన్కు అనుకూలించే చోట కేవలం ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్తో బరిలోకి దిగడం అంటే ఆత్మహత్యా సాదృష్యమే. అలాంటిది అగర్ అందుబాటులో లేని సమయంలో మరో స్పిన్నర్ను ఎంపిక చేయాల్సింది పోయి.. అతడి ప్లేస్లో లబుషేన్ను జట్టులోకి తీసుకోవడమే అతిపెద్ద తప్పు’ అని గంభీర్ అన్నాడు.