నవతెలంగాణ-గోవిందరావుపేట
అకాల వర్షాలు అంతులేని వరదలతో కోతలకు గురి అయిన మరియు ఇసుక మేటలు వేసిన పంట పొలాలను ప్రభుత్వం వెంటనే సరిచేసి పంటలకు అనుకూలంగా మార్చాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని గుండ్ల వాగు పరివాహక ప్రాంతంలో వరదలకు కొట్టుకుపోయిన పంట పొలాలను భూములను సీతక్క రైతులతో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గుండ్ల వాగు పరివాహక ప్రాంతంలో వరదల వల్ల భూములు పంటలకు అనుకూలంగా లేకుండా పోయాయన్నారు. ఇప్పటికిప్పుడు భూములను చదును చేసుకునే స్థితిలో రైతులు లేరని ప్రభుత్వమే సర్వే చేసి కోతకు గురైన పంట పొలాలను లెవెల్ చేసుకునే విధంగా ఎకరానికి 30 వేల రూపాయలు రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఖరీఫ్ లో పంటను కోల్పోయిన రైతు రభి కాలం నాటికైనా సాగు చేసుకునేందుకు భూములు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అకాల వర్షాల వలన వరదలు వచ్చి పంట నష్టం వాటిల్లిందని, అలాగే పొలాల్లో ఉన్న మోటార్లు కొట్టుకుపోయాయి అని, మళ్ళీ పంట సాగుకు పనికిరాకుండా ఇసుక మేటలు పెట్టాయని కావున ఇప్పటికీ అయిన అధికారులు చొరవ చూపి గుండ్ల వాగు మరియు దయ్యాల వాగు, జంపన్న వాగు పరివాహక ప్రాంతాల పొలాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి తగు నివేదిక పంపించి ఎకరానికి 30000/- రూపాయల నష్ట పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక మేటలు పెట్టిన పొలాలు సాగుకు పని చేయవు కనుక ఇసుక రవాణాకు అనుమతించాలని, అలాగే వరదల్లో కొట్టుకుపోయిన మోటర్లకు ఐ.టి.డి.ఏ., ఎస్.సి.కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వార మోటార్లు ఇప్పించి ఆదుకోవాలని, వరదల వల్ల కూలిపోయిన వంతెనలకు మరమ్మత్తు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, తండా కృష్ణ, గుండె శరత్, లకావత్ జుమ్మిలాల్, వాసం వెంకటేశ్వర్లు, లకావత్ తుకారాం, కుంజ నారాయణ, తండా సమ్మయ్య, బానోత్ టాన్, లకావత్ జవహర్ లాల్, పెనక రవి, జీడి మల్లేష్, కల్తీ సమ్మయ్య, తాటి కృష్ణయ్య, జల్లెళ్ళ సమ్మయ్య, ఈక నారాయణ, పోదెం ముత్తయ్య, గాందర్ల బాబు, గందర్ల సాంబయ్య, రేగ నాగేశ్వర్ రావు, తాటి సమ్మయ్య, ఈక నర్సయ్య తదితర రైతులు పాల్గొన్నారు.