– జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వం వరద రాజకీయాలు చేయడం మానుకొని చేతనైతే వరద బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అభ్యుదయ కాలనీ మరియు ప్రాజెక్టునగర్ గ్రామాల్లో వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ వరదలు పూర్తయి 15 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందకపోవడం దురదృష్టకరం అన్నారు. వరదల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం రహదారులు నష్టం బర్లు గోర్లు జీవాలు నష్టం జరిగిన ఇప్పటివరకు ఇలాంటి సర్వేలు నిర్వహించకపోవడం బాధాకరం అన్నారు. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బియ్యం కూరగాయలు పంచడం కాదని నష్ట పరిహారం అందించాలని అన్నారు. మీకు అందిస్తున్న ఈ తాత్కాలిక సహాయం మాత్రమేనని ధర్నాలు రాస్తారోకోలు ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు మావల్ల కొంత న్యాయం జరిగిన బాగుంటుందన్న నిర్ణయంతో తాము ప్రజల పక్షాన పోరాడుతున్నామని అన్నారు.
ప్రాజెక్టునగర్ లో నిత్యవసరాలు పంపిణీ
మండలంలో ప్రాజెక్టునగర్ గ్రామంలోని నలభై కుటుంబాలకు ప్రేరణ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్య అవసరాలను అందిస్తున్నట్లు రంగారెడ్డి తెలిపారు. ప్రాజెక్టునగర్ గ్రామాల ప్రజల ఆర్థిక ఇబ్బందులను విధానాన్ని చెప్పడం వల్ల పలువు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని ఇకముందు కూడా వస్తారని ఎంతో కొంత తోచినంత సహాయాన్ని అందిస్తారని అన్నారు. ఇది మనకు ప్రధానం కాదని వరదల నుండి శాశ్వతంగా గ్రామానికి విముక్తి కావాలని అన్నారు. వరదల వల్ల ప్రాణభయం ఆస్తి నష్టం జరగడం ప్రదేశంలో నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు 20వేల ఆర్థిక సహాయం
మండలంలోని ప్రాజెక్టునగర్ గ్రామంలో రెహమాన్ కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందగా రెహమాన్ కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున రంగారెడ్డి 20 వేల
రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. నుండి పరిహారం మందే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ ప్రభుత్వం ద్వారా పరిహారాన్ని అందించే విధంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని రెహమాన్ కు భరోసా ఇచ్చారు.
ఘనంగా ఆదివాసి దినోత్సవం
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండలములోని ప్రాజెక్టు నగర్ లో రాష్ట్ర నాయకులు గొంది రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వం ఆదివాసీల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు . పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. లేనిపోని కుంటి సాగులతో అరకొర భూములకు పట్టాలి ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగిందన్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారికి నాకు పత్రాలు ఇవ్వకపోవడం వారిని మరింత కుంగ దీసిందన్నారు. ఆదివాసీలు వారి హక్కులు రక్షణ కొరకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు పరిశ్రమలు ఏర్పాటుకు కంపెనీల ఏర్పాటుకు బడా భూస్వాములకు ఐరన్ ఒర్ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు కంపెనీలకు వేలాది ఎకరాల అటవీ భూములను కట్టబెడుతున్న ప్రభుత్వం ఆదివాసీలు వరదల వల్ల తమకు భయం లేకుండా ఉండేందుకు నివసించేందుకు స్థలం ఇవ్వమంటే అటవీ భూములు ఇవ్వమనడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి తీగలాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి సభ్యులు బి రెడ్డి సాంబశివ జిల్లా కమిటీ సభ్యులు పొదిల చిట్టిబాబు, అంబాల పోశాలు, గ్రామ కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, రెడ్డి పురుషోత్తం రెడ్డి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గొంది రాజేష్ జిల్లా కమిటీ సభ్యులు కొట్టెం కృష్ణారావు ముమ్మిడి ఉపేంద్ర చారి కేతం సూర్యనారాయణ అంబాల మురళి రమేష్ కారం రజిత మంచాల కవిత జిమ్మజ్యోతి పాల్గొన్నారు.