నవతెలంగాణ – హైదరాబాద్: కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు 2023 బాగా కలిసివస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్ చిత్రంతో భారీ హిట్ సొంతం చేసుకున్న ఆయన తాజాగా జవాన్ చిత్రంతోనూ మెప్పించారు. తొలి రోజే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పఠాన్ చిత్రం ఏకంగా వెయ్యి కోట్లు కొల్లగొట్టగా.. ఇప్పుడు జవాన్ కూడా అ స్థాయి వసూళ్లను రాబట్టేలా కనిస్తోంది. ఈ చిత్రం తొలి రోజే రికార్డు కలెక్షన్లను రాబట్టింది. గురువారం విడుదలైన జవాన్ మొదటి రోజు భారత్ లో అన్ని భాషల్లో రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 నుంచి 150 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.