నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బుధవారం వారు కారు పార్టీకి జై కొట్టారు. ఈ సందర్బంగా గులాబీ పార్టీ కండువాలు కప్పి మంత్రి హరీశ్ రావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.