– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి
– ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్ షో
– కాంగ్రెస్లోకి ఆదిభట్ల బీఆర్ఎస్
– మున్సిపల్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూరులో పర్యటించారు. బీఆర్ఎస్ మున్సిపల్ కార్యదర్శి పైల్ల శ్రీనివాస్రెడ్డితో పాటు మర్రి కష్ణా రెడ్డి, రామారావు, ప్రదీప్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివద్ధి దూరంలో ఉందన్నారు. డ్రయినేజీ వ్యవస్థ లేదని చెప్పారు. రోడ్లు సరిగ్గా లేవన్నారు. 15 సంవత్సరాల్లో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇండ్ల స్థానాలు లేక ప్రభుత్వ ఇండ్లు రాక పేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. పింఛన్లు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. రేషన్ కార్డులు ఒకటి కూడా మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. గ్యాస్ ధర ఆకాశాన్ని అందుతున్నయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండ్లు, ఇళ్లస్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులను అందజేస్తామని చెప్పారు. ప్రతి ఇంట్లో ఉన్న మహిళను మహాలక్ష్మి అందజేస్తామని తెలియజేశారు. పేద ప్రజలకు గ్యాస్ సిలిండర్ రూ.500కే అందజేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలోని ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. చేయూత కింద పింఛన్ ను రూ .4000 అందిస్తామని అన్నారు. అందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రి చికిత్స అయ్యే ఖర్చు పది లక్షల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ లు స్రవంతి, ఆర్థిక, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, ఈసీ శేఖర్ గౌడ్, కన్సిలర్లు కుంట్ల మౌనిక ఉదరు పాల్ రెడ్డి, మర్రి అర్చన రాంరెడ్డి, చిలుక మధు సూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.