నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్సెండ్ చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ఢిల్లీలో గద్దర్ ప్రకటించారని.. ఆయన ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారని ఆ వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గద్దర్ తో డీల్ కుదుర్చుకున్నారని. దాంతో, గద్దర్ తమ పార్టీకి దూరమయ్యరని అన్నారు. తాను గద్దర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.