నవతెలంగాణ-సిద్దిపేట : పట్టణంలోని కాకతీయ టెక్నో హైస్కూల్లో విద్యార్థులు పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మట్టి వినాయకులను, వివిధ రూపాలలో తయారుచేసి అబ్బురపరిచారు. మట్టితో, పిండితో, విత్తనాలతో.. మొదలగు వినాయకులను, పదార్థాలతో తయారు చేశారు. ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులకు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ఆధ్యాత్మికతను పెంపొందించే విషయాలను బోధించడం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రేపటి సమాజ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థులను ఉత్తేజితలను చేస్తాయన్నారు. మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.