నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు సముచిత స్థానం ఇస్తారని ఆ పార్టీ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శాసన మండలి డిప్యూటీ చైర్మెన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ 1970 నుంచి ఎంతో మంది నాయకులు ఎన్నో చెప్పినా ఏమీ చేయలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారంటే నెరవేరుస్తారని తెలిపారు.
ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ను మరో సారి అధికారంలోకి తీసుకురావానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మెన్ పిట్టల రవీందర్, టీఎన్జీఓ మాజీ నేత మామిళ్ల రాజేందర్ ముదిరాజ్, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) తదితరులు పాల్గొన్నారు.