![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/Screenshot_2023-09-11-18-13-12-418-edit_com.whatsapp.jpg)
నవతెలంగాణ పెద్దవంగర: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలను పొందిన లబ్ధిదారులే మళ్లీ బీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తండాబాట కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. నేడు మండల పరిధిలో చేపట్టనున్న తండాబాట కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, గృహలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి మరెన్నో పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వృద్ధులకు పింఛన్ ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్వంద వైఖరి అవలంబిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, కేతిరెడ్డి సోమనసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, మాజీ మండల అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు, బొమ్మెరబోయిన రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జాటోత్ కమలాకర్, ఎంపీటీసీలు ఏదునూరి శ్రీనివాస్, బానోత్ రవీందర్ నాయక్, కనుకుంట్ల వెంకన్న, బానోత్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, ఉపసర్పంచులు శ్రీరామ్ రాము, శేఖర్, అనపురం రవి గౌడ్, నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.