నవతెలంగాణ- విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా నుంచి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడితో కలిసి గర్భిణి విశాఖ చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి విశాఖ రైల్వే స్టేషన్లోనే ఉంది. రైల్వే స్టేషన్లో తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు. తనతో పాటు స్టేషన్లో ఉన్న ఒడిశా జంట బాలుడిని కిడ్నాప్ చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.