
– బక్కన్న దాడిపై మంథని ఎన్నికల అధికారికి పిర్యాదు చేసిన
– ఏఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు: ఒంటరిగా నిలబడితా నన్ను చంపడి కానీ నా కార్యకర్తలపై దాడులెందుకని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు దాడికి పాల్పడిన బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. మంగళవారం రాత్రి మహాముత్తారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ముత్తారం మండలం ఓడేడు గ్రామ సర్పంచ్ సిరికొండ బక్కారావు, ఆయన భార్య పద్మపై కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించీ, బుధవారం మంథని చౌరాస్తా నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి బక్కన్నపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు కాంగ్రెస్ తరపున మహాముత్తారం మండలానికి చెందిన ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం అతడి ప్రాణాలకు ముప్పు ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి అనుకూలంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు, క్యాడర్పై దాడులు చేస్తామని బెదిరించారని తమ కార్యకర్తలు చేబుతున్నట్లు వాపోయారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి నియోజకవర్గంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదని అధికారుల దృష్టికి తీసుకపోయినట్లుగా తెలిపారు. పోటీ అభ్యర్థులను బెదిరించడం బీఆర్ఎస్ నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులు నా క్యాడర్ను, నాయకులను భౌతికంగా చంపుతామని బెదిరించడం ద్వారా భయాందోళన పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇది ఎన్నికల శాంతియుత రాజకీయ ప్రక్రియను నాశనం చేస్తుందని ఆరోపించారు. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మంథని నియోజకవర్గాన్ని సున్నితమైన ప్రాంతంగా పరిగణించి, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేసి తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేస్తామన్న విశ్వాసాన్ని ఓటర్లలో పెంపొందించాలని వినపత్రం అందజేసినట్లుగా పేర్కొన్నారు.