నవతెలంగాణ – అమరావతి
వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబుపై గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టారని… ఇప్పుడు ఆయన కొడుకు జగన్ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తో జగన్ పతనం ప్రారంభమయిందని చెప్పారు. జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇతర పార్టీల నేతలను కూడా అరెస్ట్ చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు.