![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230819-WA0129-300x252.jpg)
నవతెలంగాణ-డిచ్ పల్లి : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు నిరుపేదలకు కొండంత అండగా ఉందని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పది ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తులు చేస్తున్న లబ్ధిదారులకు ఇతర చోట్ల తిరగకుండానే చెక్కుల రూపంలో డబ్బులు వస్తున్నాయని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ అన్నారు. శనివారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఎల్లారెడ్డి పల్లి, మల్లాపూర్ గ్రామాలకు చెందిన పలువురు లాబ్దిదారులకు సర్పంచ్ లు ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము,బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ లతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, డైనమిక్ లీడర్ యంగ్ టైగర్ బాజిరెడ్డి జగన్ మోహన్ ఆదేశాను సారం మల్లాపూర్ కోరట్పల్లి భూమేష్ 40 వేలు, లింగసముందర్ కు చేందిన ఉమా రాణి కి 53000 వేల చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమం లో బిఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచ్ నరేష్, అరటి రఘు, బిఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు బిరీష్ శెట్టి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.