నవతెలంగాణ -హైదరాబాద్: యంగ్ స్టేట్-సవాళ్లు అనే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో దశాబ్దాల పోరాటం తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని వివరించారు. తెలంగాణను సాకారం చేసుకునేందుకు ఎందరో ఆత్మ బలిదానాలు చేశారని కేటీఆర్ చెప్పారు. ఓ రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ గొప్పగా ఎదుగుతోందని, ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని అన్నారు. హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఆర్థికంగా స్థిరపడుతున్నారని, ఇళ్లను కొనేస్తున్నారని గర్వంగా చెప్పారు.