నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల: నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేయనున్నారు. అనంతరం కేజీ టూ పీజీ క్యాంపస్ ఎదురుగ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గంభీరావుపేట లింగన్నపేట రోడ్డులో మానేరు వాగు పై హైలెవెల్ బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు లింగన్నపేటలో కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభించనున్నారు. కొత్తపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.