నవతెలంగాణ- పోచంపల్లి: భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ను ప్రారంభించారు. సైనీ భారత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను సందర్శించారు. హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూ.100 కోట్లతో చేపట్టనున్న దోభీఘాట్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాలాజీ ఫంక్షన్హాల్లో జరుగనున్న చేనేత వారోత్సవ సభలో ప్రసంగిస్తారు. చేనేతలను కాపాడటంతోపాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ని ఏర్పాటుచేసిన సైని భరత్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఓ వైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు.