నవతెలంగాణ – న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ను యూరోపియన ఎస్సే ప్రైజ్ జీవన సాఫల్య పురస్కారం వరించింది. ఈ మేరకు చార్ల్స్ వియ్లాన ఫౌండేషన ప్రకటించింది. 2021లో ‘ఆజాదీ’ పేరిట ఆమె అనువదించిన ఫ్రెంచి వ్యాసాలకు ఈ పురస్కారం లభించిందని తెలిపింది. ‘‘ప్రపంచ నిర్మాణం, భాషతో బంధం గురించి అరుంధతిరాయ్ సుసంపన్నమైన కృషి చేశారు. ఆమె కృషిని ప్రీ యూరోపియన డెల్ ఎస్సై జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించాలని భావిస్తోంది. ఫాసిజాన్ని విశ్లేషించడంలో తన వ్యాసరచనను ఆమె ఒక యుద్ధ విధానంగా మలచుకున్నారు. రాజకీయంగానూ ఆమె నిబద్ధత అభినందనీయం’’ అని ఫౌండేషన స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 12న స్విట్జర్లాండ్లోని లౌసానేలో అవార్డుతో పాటు సుమారు రూ.18లక్షల నగదు బహుమతిని అరుంధతి అందుకోనున్నారు.