![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230802-WA0046.jpg)
నవతెలంగాణ- గోవిందరావుపేట
ఈనెల 8న హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే బహుజన విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జ్ పసులాది ముఖేష్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ లో బివిఎఫ్ ములుగు జిల్లా కన్వీనర్ వావిలాల కిషోర్ అధ్యక్షతన జరిగిన బహుజన విద్యార్థి గర్జన సభా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఎస్ పి ములుగు జిల్లా ఇంచార్జ్ పసులాధి ముఖేష్ హాజరై మాట్లాడారు.ఈనెల 8వ తారీఖున హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన విద్యార్థి గర్జన సభను నిర్వహించడం జరుగుతుందనీ ఈ సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని అన్నారు. కావున ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమాన్ని చేశారు 1200 మంది ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న విషయం మనకు తెలిసింది కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు విద్యార్థులకు నిరాశే మిగిలింది కావున కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే మరో ఉద్యమానికి తెరలేపాలి కావున నిరుద్యోగులు విద్యార్థులు 8వ తారీఖున జరిగే విద్యార్థి గర్జనకు వేల సంఖ్యలో పాల్గొని నిరుద్యోగులకు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వానికి తెలిసే విధంగా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.