![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230724-WA0013.jpg)
నవతెలంగాణ -కంటేశ్వర్
మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి అని భోజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర, కేంద్రం లలోని బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వాల డొల్లతనం బయటపడిందని దండి వెంకట్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం
కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశంలో దళిత బహుజన,మత మైనారిటీలపై ముఖ్యంగా దళిత, గిరిజన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడుల నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలైన బహుజన జాతులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బామ్ సెప్ జాతీయ నాయకులు చెన్నయ్య, బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, మైనారిటీ నాయకులు షేఖ్ హుస్సేన్, బిఎల్పీ జిల్లా కన్వీనర్ కె.మధు, బిఎల్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీమాన్, బిఎస్పీ జిల్లా నాయకులు యెడ్ల రాము, దళిత నాయకులు బంగారు సాయిలు, పులి జైపాల్, బిఎల్ పి నగర నాయకులు హైమద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.